మంగళగిరిలో జరుగుతున్న
టీడీపీ మహానాడు కార్యక్రమంలో ప్రముఖ హాస్యనటుడు కిరాక్ ఆర్పీ తనదైన శైలిలో సందడి చేశారు. పసుపు దుస్తుల్లో మహానాడుకు హాజరైన ఆయన, పార్టీ కార్యకర్తలతో సరదాగా ముచ్చటిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆర్పీని చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఎంతో ఆసక్తి చూపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.