తాడేపల్లిలో శనివారం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, మావోయిస్టుల లొంగుబాటు మంచిదేనని, అయితే జనసేనతో కలవడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. దేశంలో నక్సలిజం, మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా అనడం సరైన పదం కాదని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ముందు చర్చలు జరిపి తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.