మంగళవారం ఉదయం నుండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంత్రి లోకేష్ ను కలవడానికి, తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను స్వయంగా మంత్రి లోకేష్ అర్జీల రూపంలో స్వీకరిస్తున్న నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో పోలీసులు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు.