ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతిక అకాడమీ తెలుగు భాష పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని అకాడమీ ఛైర్మన్ శరత్ చంద్ర మంగళగిరిలో గురువారం నాడు తెలిపారు. తెలుగు వర్చువల్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఇంటర్మీడియట్ అకాడమీ పాఠ్యపుస్తకాలు పైరసీ చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.