మంగళగిరిలోని ప్రసిద్ధ పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ. 147 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్, స్వదేశ్ దర్శన్ 2. 0 పథకాల కింద ఈ ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో ఆలయ పునరుద్ధరణ, రహదారుల విస్తరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఎకో పార్క్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.