సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ శనివారం తాడేపల్లిలో మాట్లాడుతూ, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతలు సరిగా లేవని, రైతులను లెక్కచేయడం లేదని విమర్శించారు. నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు.