యర్రబాలెంలో గురువారం టిప్పర్ లారీ బోల్తా పడి డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలో అదుపుతప్పిన టిప్పర్ రోడ్డు పక్కనున్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. 108 సిబ్బంది క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. టిప్పర్ యాజమాన్యం డ్రైవర్ను ఆసుపత్రికి తరలించింది. ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.