పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 34 సంస్థలు పాల్గొని 2000కు పైగా ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం అని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలో ముందంజలో ఉందని తెలిపారు.