నరసరావుపేట–రావిపాడు రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొనడంతో బైక్పై ఉన్న వ్యక్తి కారు పైభాగంపై పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.