కారంచేడు జిల్లా పరిషత్ హై స్కూల్ లో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మహమ్మద్ భాష మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసై ఎంతోమంది విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దీనివల్ల కలిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు.