క్రోసూరు పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి పడి రేణుక అనే మహిళ మృతి చెందింది. ఆమె గురజాల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర రెడ్డితో పరిచయం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై సర్కిల్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, మహిళకు ఫిట్స్ రావడంతోనే పైనుంచి కింద పడిపోయి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.