పల్నాడు జిల్లావ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన మెగా పేరంట్, టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. గతంలో రెండు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లు విజయవంతంగా నిర్వహించామని, ఈ ఏడాది మూడవ విడత కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ఆమె సోమవారం పేర్కొన్నారు. ఈ సమావేశం విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.