చేబ్రోలు మండలం వేజండ్లలోని రేషన్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డుల్లో నమోదైన నిల్వలకు మించి 12,100 కిలోల బియ్యం, 791 చక్కెర ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలపై డీలర్ కామాక్షమ్మపై కేసు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సుద్దపల్లి రేషన్ షాపులో ఎలాంటి అవకతవకలు లేవని అధికారులు తెలిపారు.