పొన్నూరు వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలో గురువారం నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరాకు రూ. 20 వేలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు నష్టపరిహారం అందే వరకు వైయస్సార్ పార్టీ పోరాడుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ అనుబంధ భాగాల నాయకులు పాల్గొన్నారు.