పెదకాకాని మండలంలోని తక్కెలపాడు రైతు సేవ కేంద్రం నుండి రైతు కావూరి శివన్నారాయణకు చెందిన 38 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని భార్గవ సాయి రైస్ మిల్లుకు తరలించారు. గుంటూరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎన్ మోహన్ రావు, పెదకాకాని తహసీల్దార్ కృష్ణ కాంత్ పర్యవేక్షణలో ఈ ధాన్యం తరలింపు జరిగింది. 17% తేమతో ఉన్న ధాన్యాన్ని విక్రయించుకోవాలని అధికారులు రైతుకు సూచించారు.