పెదనందిపాడు మండలం వరగాని చెక్ పోస్ట్ వద్ద శనివారం పెదనందిపాడు ఎస్.ఐ సిహెచ్ సత్యనారాయణ వాహనాల తనిఖీ చేపట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపినా, మత్తు పదార్థాలు తరలించినా, కోడిపందాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే 112కు సమాచారం అందించాలని కోరారు.