బుధవారం రేపల్లెలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా బీజేపీ సెక్రెటరీ పిన్ని సాంబశివరావు, రేపల్లె రూరల్ అధ్యక్షుడు డేనియల్ బాబు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం, పిఎం కిసాన్ యోజన వంటి వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యక్షుడు పీత రవి, ఉపాధ్యక్షురాలు పీత ఉష, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.