శుక్రవారం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలం, అదవులదీవి గ్రామంలో లోక్సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ లబ్ధిదారులకు స్వయంగా
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ సీనియర్ నాయకులు అనగాని శివ ప్రసాద్, సాదు నాగేశ్వరావు, భోగిరి పృథ్వీరాజ్, నక్క ప్రకాష్ రావు, నర్రా ఏడుకొండలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ తెన్నేటి పేర్కొన్నారు.