మంగళవారం తురకపాలెం గ్రామంలో గోగ కోటేశ్వరరావు (42) అనే రైతు ట్రాక్టర్పై ధాన్యం తీసుకురావడానికి వెళుతుండగా, పొలాల దారిలోని వాగు వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో అతను కాలవలో పడి, ట్రాక్టర్ అతనిపై పడటంతో నీళ్లలో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై నకరికల్లు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.