శుక్రవారం సత్తెనపల్లిలో అచ్చంపేట బస్సు దిగుతున్నప్పుడు ఫుట్బోర్డుపై కాలు జారి రోడ్డుపై పడిపోయిన గోళ్లపాడుకు చెందిన పద్మ అనే మహిళకు తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు.