ఆదివారం వరద ప్రభావిత తుళ్లూరు మండలం తాళ్ళయ్యపాలెం లంక గ్రామంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పర్యటించారు. గ్రామస్తులందరూ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆయన ఆదేశించారు. ఇందుకోసం వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 6 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నందున, ప్రజలు రిస్క్ తీసుకోవద్దని కలెక్టర్ సూచించారు.