అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ రెండో రోజు పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించి, వర్షాకాలం సమీపిస్తున్నందున గత ఏడాది సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంగళగిరి నియోజకవర్గంలోని నీరుకొండ రిజర్వాయర్ను పరిశీలించి, అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు.