గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయాలను నివారించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు గత 20 రోజుల్లో నియోజకవర్గం అంతటా 74 కొత్త ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.