తెనాలి పట్టణంలో ఆవులు, పందులు, గాడిదలు, కోతులు, కుక్కలు తిరుగుతూ ప్రజలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పల నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఈ సమస్యను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటామని, వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.