గురువారం రాత్రి తెనాలి పినపాడు మొండి గోడల వద్ద రైలు పట్టాలు దాటుతున్న సుమారు 30 ఏళ్ల గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతుడి వివరాలు తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.