బొల్లాపల్లి మండలంలోని రేమిడిచర్ల గ్రామంలో శ్రీ గంగా–గౌరీ శంకర ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ మంగళవారం తెలిపింది. దాతల సహకారంతో ఏడాది క్రితం సుమారు రూ. 3 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించినట్లు కమిటీ చైర్మన్ కలవల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నసంతర్పణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.