AP: ఏలూరు జిల్లా, చింతలపూడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుర గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిపై గుర్తుతెలియని విద్యార్థులు బ్లేడుతో దాడి చేశారు.బాధతో అతడు కేకలు వేయడంతో తోటి విద్యార్థులు లేచి చూశారు. ఆ విద్యార్థి రక్తపు మడుగులో ఉన్నట్లు వారు గ్రహించారు. హాస్టల్ సిబ్బంది హుటాహుటిన బాధితుడిని చింతలపూడి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై సతీశ్కుమార్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.