AP: కాకినాడ జిల్లా చామవరంలో జరిగిన ‘పేదలకు సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తే వచ్చే సంతోషం మరెక్కడా దొరకదని, అందుకే తాము బటన్ నొక్కి పెన్షన్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదని ఆయన తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని, ఇందుకోసం ఒక్కో కుటుంబానికి 3-4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.