AP: రాజకీయంగా
వైసీపీ అధినేత, మాజీ సీఎం
జగన్ ఒంటరి అయినట్లు తెలుస్తోంది. ఇటు కుటుంబం పరంగా, అటు రాజకీయంగా ఏ ఒక్క పక్షంతోనూ వైసీపీకి మిత్రత్వం లేకపోవడం గమనార్హం. దేశంలో
ఇండియా, ఎన్డీఏ కూటములున్నాయి.
ఇండియా కూటమిలోని రెండు, మూడు పార్టీలతో జగన్కు అనుబంధం ఉంది. ఇదే సందర్భంలో ప్రధాని
మోదీ, అమిత్ షాలతో
జగన్ అనధికార స్నేహం జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలకు దూరం చేసింది. దాంతో
జగన్ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో ఒంటరి అయ్యారని రాజకీయంగా చర్చ జరుగుతోంది.