వైసీపీ డుమ్మా.. కూటమికి తలనొప్పిగా మారిందా?

12682చూసినవారు
వైసీపీ డుమ్మా.. కూటమికి తలనొప్పిగా మారిందా?
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టడం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. కామినేని శ్రీనివాసరావు వర్సెస్ బాలకృష్ణ ఎపిసోడ్, చిరంజీవి ప్రస్తావన, బోండా ఉమా-పవన్‌ కళ్యాణ్‌ మధ్య తేడాలు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి-నాదెండ్ల మనోహర్‌ మధ్య విభేదాలు వంటివి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు. అయితే వైసీపీ సభ్యులు సభలో లేకపోయినా, ఈ పరిణామాలు తమకు అనుకూలంగా మారాయని వైసీపీ నాయకులు భావిస్తున్నారని టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్