AP: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం కారణంగా నవంబర్ 17 నుండి రెండు లేదా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఏపీలోని వైజాగ్, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురుస్తాయని వెల్లడించారు.