ఈ జిల్లాల్లో వచ్చే 3రోజులు వానలే వానలు

42చూసినవారు
ఈ జిల్లాల్లో వచ్చే 3రోజులు వానలే వానలు
AP: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే విధమైన వాతావరణం కొనసాగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్