AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి ఇది తుఫానుగా, రేపు (సోమవారం) అర్ధరాత్రి లేదా ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ (ఆదివారం) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు, రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.