ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. ముఖ్యంగా 4 ఇండిగో విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ముంబై విమానాశ్రయానికి చేరుకోవాల్సిన 13 విమానాలను దారి మళ్లించారు. ఈ వర్షాల బీభత్సానికి ఒక చెట్టు కూలిపోవడంతో 63 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.