శ్రీలంకలో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి (వీడియో)

17990చూసినవారు
శ్రీలంకలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించారు, ముగ్గురు గాయపడ్డారు. సబరగామవ, సెంట్రల్ ప్రొవిన్స్ (క్యాండి, నువారా ఎలియా) ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అత్యవసర పరిస్థితి కారణంగా క్యాండి, నువారా ఎలియా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సుమారు 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం ఆర్మీ, నేవీ సిబ్బందిని రంగంలోకి దించారు.

సంబంధిత పోస్ట్