AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ‘రెడ్ అలెర్ట్’ ఇచ్చింది. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ‘ఆరెంజ్ అలెర్ట్’ జారీ చేసింది. తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.