ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్విక్ కామర్స్ రంగంలో అడుగుపెట్టింది. రైతు బజార్లను ఆన్లైన్లోకి తీసుకువచ్చి, పండ్లు–కూరగాయలను digirythubazaarap.comలో ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జీలు లేకుండానే నిమిషాల్లో హోం డెలివరీ అందిస్తుంది. ప్రస్తుతం విశాఖలో పైలట్గా ప్రారంభించిన ఈ సేవ విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర రైతుబజార్లకు విస్తరించనుంది.