AP: తిరుపతి జిల్లాలో 'కిలాడి లేడి' ఉషారాణి నేతృత్వంలోని హనీట్రాప్ ముఠా వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి పేరుతో అమాయకులను, ప్రముఖులను వలలో వేసుకుని, బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఈ ముఠా భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఈ ముఠా బారిన పడి సర్వస్వం కోల్పోయానని వడమాలపేట మండలం పాదిరేడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చుక్క చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు.