AP: ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వాచ్మెన్ హరిగోపాల్ విద్యార్థులపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి విద్యార్థులను గదికి పిలిపించుకొని నీలి చిత్రాలు చూపించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో అలిపిరి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.