కాలువకు భారీ గండి:.. వరి, వేరుశనగ పొలాలు జలమయం

24చూసినవారు
అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో పీఏబీఆర్ కుడి కాలువకు భారీ గండి పడింది. కాలువ కట్ట తెగిపోవడంతో నీరు వరి మడులు, వేరుశనగ పొలాల్లోకి ప్రవహిస్తోంది. అధికారులు నీటిని ఆపడానికి ప్రయత్నించినా, గేట్లు పనిచేయకపోవడంతో విఫలమయ్యారు. ఈ ఊహించని సంఘటనతో తమ పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గేట్లను మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్