మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 2019లో జరిగిన 'పాముకాటు' హత్య కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కట్నం కోసం భార్య శివానిని గొంతు నొక్కి చంపి, పాముతో కరిపించి నాటకమాడిన భర్త అమితేష్తో పాటు అతని సహచరులకు జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అదనపు కట్నం కోసం శివానిని వేధిస్తున్న అమితేష్, 2019 డిసెంబర్ 1న ఆమెను హత్య చేసి, పాముకాటుతో చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఫోరెన్సిక్ నివేదికలు, పోస్ట్మార్టం నివేదికలు అసలు నిజాన్ని బయటపెట్టాయి.