నేను డ్రామాలు చేయడానికి మాల వేసుకోలేదు: పవన్ కళ్యాణ్
AP: తాను డ్రామాలు చేయడానికి మాల ధరించలేదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ జరుగుతుందని చాలా మంది చెప్పడంతో, ఆ గిల్టీతోనే స్వామి వారి మాల వేసుకుని ప్రక్షాళన చేశానని తెలిపారు. తాను కల్తీ చేసింది జగన్ అని చెప్పలేదని, సిట్ అంత స్పష్టంగా చెప్పినా ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
