AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తనకు 20 ఏళ్ల స్నేహ బంధం ఉందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ను ఒక్కమాట కూడా అనలేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఒక్క మాట అనొద్దని సంకల్పం పెట్టుకున్నానని పేర్కొన్నారు. ఏడాదిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదన్నారు. అలాగే తనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదన్నారు.