AP: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాచర్ల నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోంది. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కక్ష సాధింపులకు మాచర్లను వేదికగా చేసుకున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చీ రాగానే అక్రమ కేసులు పెట్టి 54 రోజులు నన్ను జైలుకు పంపారు. రాజకీయ కక్ష సాధింపులతో 6మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, చెక్ పోస్టులు పెట్టి రసీదులు ఇవ్వకుండా రైతుల నుంచి అక్రమ వసూళ్లు బ్రహ్మారెడ్డికి తెలియకుండానే జరిగాయా? అని పిన్నెల్లి ప్రశ్నించారు.