AP: కూటమి నేతలకు దమ్ముంటే మాజీ సీఎం జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏ అంశంపైనైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చంద్రబాబు ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, చంద్రబాబు మోసం చేశారని ప్రజలు భావిస్తున్నారని సజ్జల ఆరోపించారు. ప్రజల దగ్గరకు వెళ్లేందుకు చంద్రబాబు భయపడుతున్నారన్నారు.