AP: తిరుమలలోని పరకామణిలో చోరీ జరిగిందంటూ మంత్రి నారా లోకేశ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ‘నేనే టీటీడీ ఛైర్మన్గా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని నిరూపిస్తే అలిపిలో నా తల నరుక్కుంటా. కూటమి ప్రభుత్వం తిరుమలను రాజకీయ అడ్డాగా మార్చింది. దమ్ముంటే ఈ కేసును సీఐడీతో కాదు సీబీఐతో విచారణ జరిపించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.