AP: అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాజధాని అమరావతిపై ఎవరైనా హింసకు పాల్పడితే, అదే వారికి చివరి రోజు అవుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ దేహం అయితే, అమరావతి గుండె లాంటిదని, దాని అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజధాని విషయంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.