AP: కూటమి ప్రభుత్వం రాకముందు ఏపీలో ప్రజా సంక్షేమంపై చర్చ జరిగేదని మాజీ సీఎం జగన్ తెలిపారు. కానీ చంద్రబాబు వచ్చాక రెడ్బుక్ అరాచకం, కస్టోడియల్ డెత్స్, హామీల మోసాలపై చర్చ జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకు పోయిందని, పోలీసు స్టేషన్లకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులున్నాయని, బాబును ప్రశ్నిస్తే అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.