భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం బ్యాగేజీ నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి తిరిగి వస్తున్న మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను డ్యూటీ ఫ్రీగా దిగుమతి చేసుకోవచ్చు. అయితే, వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసించి ఉండాలి లేదా భారత సంతతికి చెందినవారై ఉండాలి.