భారత్, చైనా దేశాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకుంది. గతేడాది కంటే 12 శాతం పెరుగుదల ఉన్నట్లు భారత్లోని చైనా దౌత్యవేత్త షు ఫియాంగో తెలిపారు. 2025 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం 155 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించిందని ఆయన వెల్లడించారు.